‘పెంగ్విన్’ టీజర్ టాక్

కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘పెంగ్విన్’. తెలుగు, తమిళ్ ద్విభాషా చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే అఫిషీయల్ ప్రకటన వచ్చేసింది. ఈ నెల 19న పెంగ్విన్ ఓటీటీలో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు.

టీజర్ లో స్టోరీ లైన్ చెప్పే ప్రయత్నం చేశారు. బాబుతో హ్యాపీగా గడుపుతున్న కీర్తి సురేశ్ కు ఊహించని షాక్. బాబు మిస్సవుతాడు. కాదు మరణిస్తాడు. ఆ షాక్ నుంచి కీర్తి సురేష్ తేరుకోలేకపోతుంది. ఇంతకీ ఆ బాబుని చంపింది ఎవరు ? అనే పాయింట్ వ్యూలో.. సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంగా పెంగ్విన్ తెరకెక్కినట్టు టీజర్ ని చూస్తే అర్థమవుతోంది.

‘పేట’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించారు.  సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు.