సినీ ప్రముఖులకి జగన్ కండీషన్

టాలీవుడ్ ప్రముఖులు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకి సీఎం జగన్ తో భేటీ కానున్నారు. ఏపీలోనూ సినిమా షూటింగ్ లకి అనుమతి, పరిశ్రమ సమస్యలు, ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై చర్చించనున్నట్టు సమాచారమ్. అయితే సీఎం జగన్ ని కలవడానికి ఒక్కో విభాగం నుంచి ఇద్దరు చొప్పున వెళ్లాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన జాబితాని కూడా రెడీ చేశారు. వీరంతా ఏపీకి వెళ్లేందుకు రెడీ అయ్యారు.

ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్, స్టూడియా, డిస్ట్రిబ్యూటర్ సర్కిల్ నుంచి ఇద్దరు ఇద్దరు వంతున వెళ్లాలని, అలాగే ఫెడరేషన్, మా, డైరక్టర్ విభాగాల నుంచి ఇద్దరేసి వంతున వెళ్లాలని అనుకున్నారు. ఇంతలో సీఎం ఆఫీస్ నుంచి సినీ ప్రముఖులకి ఓ కండిషన్ అంటూ మెసేజ్ వచ్చింది. ఏడుగురితో కూడిన బృందం మాత్రమే సీఎం జగన్ తో సమావేశానికి రావాలని కోరారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తో భేటీకి ఎవరెవరు వెళ్తారు ? అన్నది ఆసక్తిగా మారింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, సి.కల్యాణ్ తప్పకుండా ఉంటారు. మిగితా వారు ఎవరు ? అనేది తెలియాల్సి ఉంది. మధ్యాగ్నం 3గంటలకి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం సమావేశం ఉండనుంది.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సినిమా, టీవీ షూటింగ్ లకి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా షూటింగ్ లకి అనుమతులు ఇవ్వనుంది. అదే విధంగా ఏపీలో సినీ పరిశ్రమని అభివృద్ధి చేసేలా కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశాలున్నట్టు సమాచారమ్.