ఏపీలో 218 కొత్త కేసులు

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ రాష్ట్రంలో వందకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 218 కొత్త కేసులు నమోదయ్యాయ్. అయితే, వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 82 ఉండగా.. రాష్ట్రంలో 136 పాజిటివ్‌ కేసులు వచ్చాయి.రాష్ట్రంలో 136 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 5,247 కేసులు నమోదయ్యాయి.

గడచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 78కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,475 చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 1573 మంది చికిత్స పొందుతున్నారు.