ఐపీఎల్’పై నిర్ణయం నెల వాయిదా !

ఈ యేదాది ఐపీఎల్ నిర్వహణపై ఐసీసీ ఇంకా తేల్చలేదు. బుధవారం ఐసీసీ బోర్డ్ సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐపీఎల్-13 నిర్వహణపై తేల్చుతారని అందరు భావించారు. కానీ అందుకు మరో నెల సమయం తీసుకుంటామని ఐసీసీ తెలిపింది. ఐపీఎల్ తో పాటు టీ20 ప్రపంచకప్ పై నిర్ణయాన్ని వాయిదా వేసింది.

“నిర్ణయం తీసుకునేందుకు మాకు ఒక్క అవకాశమే ఉంది. అందుకే అది సరైనదిగా ఉండాలి. సభ్య దేశాలు, బ్రాడ్కాస్టర్లు, భాగస్వాములు, ప్రభుత్వాలు, ఆటగాళ్లతో సంప్రదింపులు జరుపుతాం. ఆ తర్వాతే సరైన నిర్ణయం తీసుకుంటాం” అని బోర్డు సమావేశం అనంతరం ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది.