వరుసగా ఆరో రోజు పెరిగిన పెట్రో ధరలు

పెట్రో ధరలు నాన్ స్టాప్ గా పెరుగుతున్నాయ్. గత ఆరు రోజులుగా పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్ ధరను లీటరుకు 57 పైసలు, డీజిల్ ధరను 59 పైసలు పెంచేశాయ్. తాజా పెంపుతో ఆరు రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 3.31, డీజిల్ ధర లీటరుకు రూ. 3.42 పెరిగాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి :

ఢిల్లీ : పెట్రోల్ రూ. 74.57 డీజిల్ రూ. 72.81

ముంబై : పెట్రోల్ రూ. 81.53. డీజిల్ రూ.71.48

చెన్నై: పెట్రోల్ రూ. 78.47. డీజిల్ రూ. 71.14

బెంగళూరు: పెట్రోల్ రూ.76.98. డీజిల్ రూ. 69.22