తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా

తెలంగాణలో ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే జనగాం ఎమ్మెల్యే ముత్తంరెడ్డి, నిజామాబాద్‌ గ్రామీణ ఎమ్మె్ల్యే బాజిరెడ్డి గోవర్ధన్ లకి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరు ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా మరో తెరాస ఎమ్మెల్యేకు కరోనా సోకింది. నిజామాబాద్ అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

నిజామాబాద్‌ గ్రామీణ ఎమ్మె్ల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ఇప్పటికే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు గణేశ్‌ గుప్తా కూడా ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిసింది. దీంతో గత రెండు రోజులుగా ఆయనలో కరోనా లక్షణాలు కనిపించాయి. పరీక్షలు చేయించుకోగా కరోనా అని తేలింది. ఆయన వెంటనే క్వారంటైన్‌కు వెళ్లారు.