బోరున ఏడ్చేసిన సుశాంత్ గర్ల్ ఫ్రెండ్


బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. డిప్రెషన్ లోనే ఆయన ఆత్మహత్య చేసుకుంటారని పోలీసులు ప్రాథకంగా నిర్థారించారు. సుశాంత్ పోస్ట్ మార్టమ్ లోనూ ఆయనది ఆత్మహత్యేనని తేలింది. ఆదివారం ఉదయం ఉరి వేసుకోవడానికి ముందు సుశాంత్‌ తన ఫోన్‌ ద్వారా గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి, స్నేహితుడు మహేశ్‌ శెట్టితో మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో పోలీసులు వారిని విచారించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుశాంత్‌ పోస్ట్‌మార్టం పూర్తయిన తర్వాత రియా చక్రవర్తి కూపర్‌ ఆసుపత్రికి వెళ్లి, ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. తిరిగి కారు ఎక్కే సమయంలో ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. సుశాంత్-రియా ప్రేమలో ఉన్నారని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ యేడాది నవంబర్ లోనే వీరి పెళ్లి జరగనుందనే న్యూస్ కూడా బయటికొచ్చింది.

రియా చక్రవర్తి తెలుగు సినిమా ‘తూనీగ తూనీగ’తో కథానాయికగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత పలు హిందీ సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఈ ఏడాది జనవరి 21న సుశాంత్‌కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆయనతో కలిసి తీసుకున్న ఫొటోల్ని షేర్‌ చేశారు. పోలీసుల విచారణలో సుశాంత్ గురించి తెలియని విషయాలు ఏమైనా చెబుతుందా ? అన్నది ఆసక్తిగా మారింది.