రఘురామకృష్ణం రాజు.. ఓ షాకింగ్ న్యూస్ !

వైసీపీలో ఎంఫీ రఘురామకృష్ణం రాజు వ్యవహారం ముదురుతోంది. ‘మా చిన్న కులంలో చిచ్చుపెట్టొద్దు’ అంటూ రఘురామకృష్ణం రాజు నిన్న చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో జిల్లా వైకాపా నేతలు సీఎం జగన్‌ను కలిశారు. ఆ వెంటనే ఎంపీ రఘురామకృష్ణం రాజుపై ఎటాక్ చేశారు. సీఎం జగన్ అన్ని కులాల వారికి న్యాయం చేస్తున్నారు. మీరే చిచ్చుపెడుతున్నారని మంత్రి రంగనాథరాజు విమర్శించారు. మంత్రి పేర్ని నాని కూడా ఎంపీ రఘురామకృష్ణం రాజుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
 
‘ఎమ్మెల్యేలకు ఎన్ని ఓట్లు వచ్చాయో.. మీకు ఎన్ని ఓట్లు వచ్చాయో సరిచూసుకోండి. మీ ఎంపీ స్థానంలోని ఎమ్మెల్యేలను ఎలా గెలిపించారో చెప్పాలి. వైఎస్‌ఆర్‌ బొమ్మ, జగన్‌ కష్టంపైనే వైకాపాలోని ఎమ్మెల్యేలు గెలిచారు. అవసరంకోసం పార్టీలోకి వచ్చి ఆ తర్వాత కనిపించడం లేదు” అంటూ రఘురామకృష్ణం రాజును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రఘురామకృష్ణం రాజుకు మూడు పార్టీల్లోకి వెళ్తానన్న ఎవరు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు.