బ్రేకింగ్ : ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాల్లో వైసీపీ విజయం


ఏపీ రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. మొత్తం నాలుగు స్థానాలను అధికారిక పార్టీ వైసీపీ గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 మంది స‌భ్య‌ల‌కు గాను 173 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గెలుపొందిన వైసీపీ అభ్యర్థులకి ఒక్కోక్కరి 38 ఓట్ల చొప్పున వచ్చాయి. టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యకు కేవలం 17ఓట్లు మాత్రమే వచ్చాయ్.

టీడీపీ చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనలేదు. అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఓటింగ్ లో పాల్గొన్న నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు రాంగ్ ఓటింగ్ వేశారు.

తాజాగా నలుగురి గెలుపుతో రాజ్యసభలో వైసీపీ బలం పెరిగింది. తాజా విజయంపై ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పరిమళ్‌ నత్వానీ, మోపిదేవి వెంకటరమణ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ని కృతజ్ఝతలు తెలిపారు.