మీడియా రంగంలోకి లక్ష్మీ ప్రణతి ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి గురించి ఓ ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఆమె మీడియా రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. త్వరలోనే లక్ష్మీ ప్రణతి ఓ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ‘యువ’ అనే పేరుతో ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ప్రేక్షకులను అలరించనుంది అనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.ఈ ఛానెల్‌కు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకొంటున్నారు.

ఈ ప్రచారంపై ఇప్పటి వరకు ఎన్టీఆర్ దంపతులు స్పందించలేదు. దీంతో.. ఈ న్యూస్ నిజమేనేమోనని నందమూరి అభిమానులు కూడా అనుకుంటున్నారు. లక్ష్మీ ప్రణతి పెద్దగా బయట కనిపించదు. ఇంట్లోనే ఉంటూ పిల్లలని చూసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లు అవుతుండటంతో.. లక్ష్మీ ప్రణతి బయటికొచ్చి.. ఓ మీడియా సంస్థని నడపాలని చూస్తున్నారా ? అన్నది తెలియాల్సి ఉంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తారక్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ సినిమా ఉండనుంది. ఈ రెండు సినిమాల తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ సినిమా ఉండనుంది.