ఢిల్లీ పోలీస్ పాటకు అక్షయ్ ఫిదా

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన ‘కేసరి’ మ్యూజికల్ హిట్ అయింది. ఈ సినిమాలోని ‘తేరి మిట్టీ’ పాట ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది. మనోజ్‌ ముంటాసిర్‌ రాసిన ఈ పాటను బీ ప్రాక్‌ ఆలపించాడు. తనిష్ భాగ్చి సంగీతం అందించారు. ఈ పాటని ఢిల్లీ పోలీస్‌ అధికారి రజత్‌ రాథోడ్‌ వయోలిన్‌ వాయిస్తూ పాడారు. తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. రజత్ రాథోడ్ పాడిన పాట ఇప్పుడు వైరల్ అవుతోంది. అద్భుతంగా పాడరంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే రజత్ రాథోడ్ మాత్రం సంతృప్తి చెందలేదు. తాను అక్షయ్ కుమార్ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నాని పేర్కొన్నారు. అక్షయ్ కు ట్యాగ్ చేశారు. ఇంకేంముంది ? అక్షయ్ కూడా స్పందించారు.

‘తేరి మిట్టీ పాట నాకు ఎప్పుడూ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. ఈ పాటను నేను ఎన్ని సార్లు విన్నానో. ఈ సారి కూడా ఎలాంటి తేడా లేకుండా పాడి షేర్‌ చేసిన రజత్‌ రాథోడ్‌కు కృతజ్ఞతలు’ అని అక్షయ్‌ రీట్వీట్‌ చేశాడు. దీంతో రజత్ రాథోడ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్. అక్షయ్ కి ఆయన థ్యాంక్స్ చెప్పారు.