బ్రేకింగ్ : తెలంగాణలో 879 కొత్త కేసులు


తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 879 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 652 కేసులు, మేడ్చల్‌ పరిధిలో 112 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈరోజుతో నమోదైన కేసులని కలుపుకొని తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9553కు చేరుకుంది.

కరోనా బాధితుల్లో మంగళవారం 219మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన 9వేలకు పైగా కేసుల్లో 4224 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 220 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రస్తుతం 5109మంది చికిత్సపొందుతున్నారు. ఇదే తరహా ప్రతిరోజు కొత్త కేసులు నమోదైతే.. తెలంగాణలో మరో రెండ్రోజుల్లో కరోనా కేసుల సంఖ్య 10వేలకి చేరనుంది.