ఏపీలో 553 కొత్త కేసులు

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 553 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 10,884కు చేరింది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 4,988 మంది కోలుకోగా, మరో 5,760 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

కరోనాతో కొత్త ఏడుగురు మృతి చెందారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందినవారు ఇద్దరు చొప్పున ఉండగా, తూర్పుగోదావరికి చెందినవారు ఒకరు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 136కి చేరింది.