ఏపీలో 605 కొత్త కేసులు

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో 22,305 మంది నమూనాలు పరీక్షించగా 605 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో నలుగురు, కర్నూలులో నలుగురు, గుంటూరు, విశాఖ జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 146కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 5,196కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 6,147 మంది చికిత్స పొందుతున్నారు.