దాసరి తనయుల ఇల్లు వివాదం.. ఎందుకొచ్చిందంటే ?

సినీ పరిశ్రమలో వివాదాలకు పరిష్కారం చూపే దాసరి కుమారులు రోడ్డెక్కడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ వివాదం ఏంటంటే.. ? జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 46లో దాసరికి ఇల్లు ఉంది. ఇందులో ప్రస్తుతం పెద్ద కుమారుడు ప్రభు కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నారు. తండ్రి వీలునామా ప్రకారం ఇల్లు తన కుమార్తెకు చెందుతుందని దాసరి పెద్ద కొడుకు ప్రభు అంటున్నారు.

చిన్న కొడుకు అర్జున్ మాత్రం అది మా నాన్న ఆస్తి. దానిని ఎవరికి రాసి ఇవ్వలేదు. మా అన్నయ్య దగ్గర కోర్టు ఉత్తర్వు ఏమైనా ఉందా? ఆస్తికి సంబంధించిన వీలునామా ఉంటే చూపించాలి. ఆ ఇల్లు మా అన్నయ్య, నాకు, మా చెల్లులు ముగ్గురికి చెందాల్సిన ఆస్తి అని అరుణ్ అంటున్నారు.

మాది చిన్న కుటుంబం కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుంది. అన్నయ్యకు సమస్యలు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. మా అన్నయ్య న్యాయపోరాటం చేయవచ్చు.. నేను కూడా సిద్ధంగా ఉన్నా. ఇంట్లోకి అక్రమంగా వెళ్లలేదు. మా ఇంట్లోకి నేను వెళ్లాను. ఇల్లు మా ముగ్గురిదీ. నేను ఎవరిపైనా దౌర్జన్యం చేయలేదు. సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు సమస్యను పరిష్కరిస్తామంటే నాకేం అభ్యంతరం లేదన్నారు అరుణ్.