విశాల్ ‘చక్ర’ ట్రైలర్ టాక్

ఎమ్.ఎస్‌. ఆనందన్ దర్శకత్వంలో విశాల్ నటించిన చిత్రం ‘చక్ర’. శ్రద్ధా శ్రీనాథ్‌, రెజీనా కథానాయికలు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌నువిడుదల చేశారు. సైబర్ క్రైమ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది.

ఆగస్టు 15 ఇండిపెండెన్స్‌ డే. హైదరాబాద్‌ సిటీ మొత్తం హై అలర్ట్‌లో ఉంటుంది. కానీ, ఆరోజు..’ అంటూ హైదరాబాద్‌లో జరిగిన దొంగతనం గురించి విశాల్ పరిశోధన మొదలు పెట్టడంతో ట్రైలర్ మొదలైంది. ‘కంటికి కనిపించని వైరస్‌ మాత్రమే కాదు.. వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ కూడా ప్రమాదకరమే.. వెల్‌కమ్‌ టు డిజిటల్‌ ఇండియా’ అంటూ ఆగంతకుడు చెప్పిన డైలాగ్‌లో ట్రైలర్‌ ముగిసింది.