కుట్ర : సుశాంత్ ఫాలోవర్స్ ని అన్ ఫాలో చేస్తున్నారు

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య కేసు పక్కదోవ పడుతుదనే అనుమానం వ్యక్తం చేశారు బాలీవుడ్‌ నటి, భాజపా ఎంపీ రూపా గంగూలీ. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్‌ చేశారు. వరుస ట్వీట్లు చేసిన ఆమె, ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షాలను ట్యాగ్‌ చేశారు.

‘సుశాంత్‌ ఆత్మహత్య తర్వాత ఆయన సామాజిక మాధ్యమాలను ఎవరో వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సుశాంత్‌ ఫాలో అయిన పలువురిని అన్‌ఫాలో చేస్తున్నారు. ఎవరో కావాలనే ఆధారాలను మార్చాలని ప్రయత్నిస్తున్నారు. సుశాంత్‌ చనిపోయిన నాటి నుంచి ఫాలోవర్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి” రూపా గంగూలీ డిమాండ్‌ చేశారు.