పీవీకి నివాళులు అర్పించిన సీఎం కేసీర్

మాజీ ప్రధానమంత్రి, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏడాది పాటు ప్రపంచ వ్యాప్తంగా పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇక ఈ ఉదయం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ప్రారంభించారు. ముందుగా పీవీ చిత్రపటం వద్ద పుష్పాంజలిఘటించారు.

పార్టీలకు అతీతంగా తెలంగాణలో పీవీ శతజయంతి ఉత్సవాలని నిర్వహిస్తున్నారు నేతలు. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్ లో నివాళులు అర్పించారు. వామపక్ష నేతలు కూడా పీవీ కూడా నివాళులు అర్పించారు. ఇక పీవీకి సీఎం కేసీఆర్ భారతరత్న భారతరత్న తీసుకుస్తారనే నమ్మకాన్ని పీవీ కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు.