హోం క్వారంటైన్’లోకి సీఎం !

కరోనా మహమ్మారి సామాన్యుడు-సెలబ్రిటీ, ధనిక-పేద, రాజు-పేద అనే తేడానే లేదు. అందరికీ సోకుతోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, కీడా ప్రముఖులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ముఖ్కమంత్రులు, ప్రధానులు, దేశాధినేతలు కూడా కరోనా బారినపడ్డారు. తాజాగా కరోనా కలవరంతో మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

సంగ్మా మణిపూర్ నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన అసమ్మతి ఎమ్మెల్యేలను తీసుకొని హోంశాఖ మంత్రి అమిత్ షాను కలపడానికి న్యూఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.  తిరిగిరాగానే ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. నాలుగురోజుల తర్వాత సంగ్మాకి కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగటివ్ వచ్చింది. అయినా మరికొద్దిరోజులు సంగ్మా హోంక్వారంటైన్ లోనే ఉండబోతున్నట్టు సమాచారమ్.