అలర్ట్ : ఈ వివరాలు ఇవ్వని వారికి రైతుబంధు డబ్బులు పడలేదు !

ఈసారి దాదాపు 5లక్షల మంది లబ్ధిదారుల అకౌంట్లలో రైతుబంధు డబ్బులు జమకాలేదు. దీనిపై వ్యవసాయ శాఖ క్లారిటీ ఇచ్చింది. వీరంతా బ్యాంక్ అకౌంట్ నెంబర్, వివరాలను ఇవ్వలేదని.. అలాంటి వారికి రైతుబంధు డబ్బులు జమ చేయడం కుదరదని తెలిపింది. అంతేకాదు.. ఆరు నెలలుగా ఎలాంటి బ్యాంకు లావాదేవీలు జరపనివారి ఖాతాల్లోనూ రైతుబంధు డబ్బులు జమకాలేదని తెలిపింది. ఇలాంటివారు 26వేల మంది ఉన్నారు. దీంతో.. రైతు బంధు సొమ్మును బ్యాంకులు వ్యవసాయశాఖకు తిరిగి పంపిస్తున్నాయని తెలిపింది.

మరోవైపు కొందరు భూముల యజమానులు వారి స్వస్థలంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో సెటిల్ కావడంతో వారిని సంప్రదించేందుకు ఫోన్ నెంబర్లు అందుబాటులో లేవు. వారికి రైతుబంధు డబ్బులు జమకాలేదని తెలిపింది. అయితే, ఇన్నాళ్లు లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది ? అని రైతులు వాపోతున్నారు. తమకి తిరిగి రైతుబంధు సాయం అందాలంటే ఏం చేయాలి ? తెలియక ఆందోళన చెందుతున్నారు.