గ్యాప్ తీసుకోలేదు.. తగ్గాను !

అసలు నేను సినిమాల నుంచి గ్యాప్ తీసుకోలేదు. కాస్త తగ్గానంతే అంటోంది సీనియర్ హీరోయిన్ రాశీ.  ‘మమతల కోవెల’ చిత్రంతో బాలనటిగా తెలుగు తెరపై అడుగుపెట్టి.. ‘గోకులంలో సీత’, ‘అమ్మో, ఒకటో తారీఖు’, ‘పెళ్లి పందిరి’, ‘ప్రేయసి రావే’ ‘మనసిచ్చి చూడు’, ‘దేవుళ్లు’ వంటి పలు హిట్‌ చిత్రాలతో తెలుగు తెరపై అగ్ర కథానాయికగా మెరిసింది రాశీ. ఆమె త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా రాశీ క్లారిటీ ఇచ్చింది.

అందరూ నేను సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టా అంటుంటారు. నిజానికి నేనెప్పుడూ నా సినీ ప్రయాణాన్ని ఆపలేదు. పరిస్థితుల్ని బట్టీ కాస్త తగ్గించానని తెలిపింది. మంచి కథ, మనసుకు నచ్చిన పాత్ర ఉన్న చిత్రాల్నే చేస్తున్నా. తెలుగులో రెండు పెద్ద సినిమాలు చేస్తా. త్వరలోనే వాటిపై అధికారిక ప్రకటన వస్తుంది. ప్రస్తుతం తమిళ్‌, తెలుగులో రెండు చిత్రాలు చేస్తున్నా. దీంతో పాటు మా భర్త శ్రీముని దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్‌ చేస్తున్నానని రాశీ చెప్పుకొచ్చింది. అన్నట్టు… ఈరోజు రాశీ పుట్టినరోజు. ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.