హోం మంత్రికి కరోనా

తెలంగాణలో ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలకి కరోనా సోకింది. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్‌లకు కరోనా పాజిటివ్ వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వీరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తాజాగా డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల హోం మంత్రి సెక్యూరిటీ సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో హోం మంత్రికి టెస్టులు నిర్వహించారు. మొదట నెగటివ్ వచ్చింది. మూడ్రోజుల తర్వాత తాజా చేసిన టెస్టుల్లో అలీకి పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన్ని చికిత్స కోసం అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఇక ఇప్పటికే తెలంగాణ పోలీస్ శాఖలో చాలామంది కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.