హైదరాబాద్ లో రేపటి నుంచి మళ్లీ కరోనా పరీక్షలు

రెండ్రోజుల పాటు హైదరాబాద్ లో కరోనా టెస్టులకి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. సేకరించిన షాపింల్స్ టెస్టులు పూర్తికాకపోవడం, ల్యాబ్ ల శానిటైజ్ కోసం రెండ్రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు. ఇక రేపటి నుంచి తిరిగి కరోనా పరీక్షలు చేస్తామని మంత్రి ఈటెల తెలిపారు. సోమవారం హైదరాబాద్ లో మంత్రి ఈటెల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనాతో 240మంది చనిపోయారు. దిల్లీ, ముంబయి, కోల్‌కతాలో పెరిగినట్టే హైదరాబాద్‌లోనూ కేసులు పెరిగాయి. మిగతా నగరాల్లో ఉన్నంత విస్తృతి హైదరాబాద్‌లో లేదు. దేశంలో కరోనా మరణాలు రేటు 3% ఉంటే తెలంగాణలో 1.7% ఉంది.

కరోనా పరీక్షల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశాం. రేపటి నుంచి పెద్ద మొత్తంలో స్వాబ్‌ సేకరణ చేపడతాం. ఐసీఎంఆర్‌ నిబంధనలకు అనుగుణంగా హోం క్వారంటైన్‌లో చికిత్స చేస్తాం. రేపటి నుంచి మళ్లీ కరోనా పరీక్షలు కొనసాగిస్తాం. హైదరాబాద్‌లో కరోనా కేసులు ఉన్నచోట కంటైన్‌మెంట్‌జోన్లు పెడతాం. అవసరమైతే హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌పై ఆలోచన చేయాల్సి ఉంటుందని సీఎం చెప్పారు. నాలుగైదు రోజుల్లో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేల మందికి చికిత్స అందిస్తున్నామని ఈటెల తెలిపారు.