TSలో 975 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో 975 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 15394 చేరాయి. ఇక కరోనాతో సోమవారం ఆరుగురు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 253కి చేరింది. సోమవారం 410 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటిదాకా డిశ్చార్జి అయిన వారి సంఖ్య 5582కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9559 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

సోమవారం నమోదైన 975 కొత్త కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ లో 861 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 40, మేడ్చల్‌లో 20, సంగారెడ్డిలో 14, కరీంనగర్‌లో 10 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా కట్టడి కోసం హైదరాబాద్ లో మరోసారి లాక్‌డౌన్ విధించాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.