పవన్‌ చాతుర్మాస దీక్ష.. ఎందుకంటే ?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాతుర్మాస దీక్షను చేపట్టారు. నాలుగు మాసాలపాటు పవన్‌ కల్యాణ్‌ దీక్ష కొనసాగుతుంది. దీక్ష కాలంలో ఒకపూటే భోజనం చేస్తారు. ఇంతకీ పవన్ ఎందుకు ఈ దీక్షను చేపట్టారు ? అంటే.. ప్రజల సంక్షేమం కోసం. ప్రజల క్షేమం, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సున కాంక్షిస్తూ పవన్‌ దీక్షకు పూనారు.
 
కరోనాతో అన్ని వర్గాల ప్రజలు ఉపాధి కోల్పోయి అల్లాడిపోతున్నారని పవన్‌ అన్నారు. ప్రజలు సాధారణ జీవనం సాగించాలని కోరుతూ దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా తెలుగు ప్రజలు మాత్రమే కాదు.. యావత్ ప్రపంచమే తల్లడిల్లిపోతున్న సంగతి తెలిసిందే. అయితే సాధారణ ప్రజల కోసం పవన్ ఒక్కపూట మాత్రం భోజనం చేయాలని దీక్ష తీసుకున్నారు.