మరో తెలుగు సినిమా ఓటీటీ రిలీజ్

ఓటీటీలో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాల జాబితా పెరుగుతోంది. తాజాగా మరో సినిమా విడుదల ఖరారైంది. ‘బాహుబలి’ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రం తర్వాత శోభూ యార్లగడ్డ నిర్మించిన సినిమా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..’. సత్యదేవ్‌ ప్రధాన పాత్ర పోషించారు. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఫేం వెంకటేష్‌ మహా దర్శకత్వం వహించారు. ఈ నెల 15న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతోంది.

నరేష్‌, హరి చందన, జబర్దస్త్‌ రాంప్రసాద్‌, టీఎన్‌ఆర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జాతీయ అవార్డు గ్రహీత బిజిబాల్‌ సంగీతం అందించారు. ఇందులో మంచులక్ష్మి గ్రామీణ యువతిగా కనిపించి మెప్పించారు. ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది. క్లీన్  ‘యు’ సర్టిఫికెట్‌ పొందింది.