కాంగ్రెస్, టీడీపీ.. ఒకే అజెండా !

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, టీడీపీ ఒకే ఎజెండాతో ఒకే రోజున నిరసనకి దిగడం ప్రాధాన్యతని సంతరించుకుంది. కరెంట్ బిల్లులపై తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆందోళనకి రెడీ అయింది. ఈరోజు జిల్లా, మండల కేంద్రాల్లోని విద్యుత్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.

మరోవైపు ఏపీలోనూ టీడీపీ ఇదే అజెండాతో ఆందోళనలకి రెడీ అయింది. తెదేపా కరెంట్ బిల్లులతో పాటు ఇళ్ల కేటాయింపులపై కూడా ఆందోళనకి రెడీ అయింది. తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించకపోవడంపై ఆ పార్టీ నేతలు నిరసనలు తెలపనున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో తెదేపా, కాంగ్రెస్ దాదాపు ఓకే అజెండాతో పోరాటానికి దిగడం హాట్ టాపిక్ గా మారింది.