TSలో 1590 కొత్త కరోనా కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం ఒక్కరోజే తెలంగాణలో 1590 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో ఏడుగురు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,902కు చేరుకుంది. మరణాల సంఖ్య 295కి చేరింది.

ఆదివారం నమోదైన 1590 కొత్త కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 1277 పాజిటివ్‌లు కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌లో 125, రంగారెడ్డి 82, సూర్యాపేట 23, సంగారెడ్డి 19, మహబూబ్‌ నగర్ 19, నల్గొండ 14 వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఇక ఆదివారం 1,166 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 10,904 మంది చికిత్స్ పొందుతున్నారు.