సుశాంత్ ఆత్మహత్య.. కరన్ జోహార్ ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు !

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ తో బాలీవుడ్‌లో దుమారం రేపింది. ఇండస్ట్రీలో బంధుప్రీతి వల్లనే సుశాంత్‌ ఒత్తిడి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడంటూ పలువురు ప్రముఖులు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కరణ్‌ జోహార్‌, ఆలియా భట్‌, సోనాక్షి సిన్హా, సోనమ్‌ కపూర్‌, సల్మాన్‌ ఖాన్‌తోపాటు పలువురు ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.

ఈ పరిణామంతో కరోనా జోహార్ కుంగిపోయారు. ఆయన ఇంకా ఏడుస్తూనే ఉన్నాడని ఆయన స్నేహితుడు ఒకరు తెలిపారు. మరీ.. ఈ విమర్శలపై కరణ్‌ ఎందుకు స్పందించడం లేదు అంటే.. ? ఇలాంటి పరిస్థితుల్లో స్పందించకుండా ఉండటమే ఉత్తమం అని అతడి లాయర్‌ సూచన మేరకే కరణ్‌ ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. అతడు మాట్లాడే పరిస్థితిలో కూడా లేడు. నేను ఏం తప్పు చేశానంటూ కుంగిపోతూ ఏడుస్తూనే ఉన్నాడు అని చెప్పుకొచ్చాడు.