తెలంగాణ కరోనా రిపోర్ట్

తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1,924 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 11 మంది మృతి చెందారు. ఇక తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 29,536కి చేరింది. మరణాల సంఖ్య 324కి చేరింది.

కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,590 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా నుంచి 99 నమోదుకాగా, మేడ్చల్‌ నుంచి 43 వచ్చాయి. ఇక బుధవారం 992 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి 17,279 మంది కోలుకున్నారు.