ఏపీలో 1,555 కొత్త కేసులు

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 1,555 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23,814కి చేరింది. బుధవారం కరోనాతో 13 మంది చనిపోయారు. వీరితో కలిపి ఇప్పటివరకు 277 మంది కరోనాతో మృతి చెందారు. 904 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 10,894 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

మరోవైపు తెలంగాణలోనూ కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1,924 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 11 మంది మృతి చెందారు. ఇక తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 29,536కి చేరింది. మరణాల సంఖ్య 324కి చేరింది. త్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,590 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా నుంచి 99 నమోదుకాగా, మేడ్చల్‌ నుంచి 43 వచ్చాయి. ఇక బుధవారం 992 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జ్ అయ్యారు.