అభిమానులకు పవన్ మెసేజ్.. వీడియో !

ఈ సంక్రాంతి కానుకగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “అజ్ఝాతవాసిగా” ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పవన్ – త్రివిక్రమ్ ల కలయికలో వస్తోన్న ఈ హ్యాట్రిక్ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ‘అజ్ఝాతవాసి’ తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లోనూ భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది.

ఈ సమయంలో పవర్ స్టార్ తన అభిమానులకి ఓ వీడియో రూపంలో మెసేజ్ ఇచ్చారు. ముఖ్యంగా ఓవర్సీస్ అభిమానులని దృష్టిలో పెట్టుకొని ఈ మెసేజ్ ఇచ్చినట్టు కనబడుతోంది. “సొంత ఊరు, రాష్ట్రం, దేశం విడిచి వేరే దేశంలో స్థిరపడటం సాధారణ విషయం కాదు. దానికి మీరు పడ్డ శ్రమని అర్థం చేసుకోగలను. తన బద్రి సినిమా యుఎస్ లో చాలా తక్కువ థియేటర్స్ లో రిలీజై హిట్ టాక్ తెచ్చుకొంది. ఇప్పుడు ‘అజ్ఝాతవాసి’ రికార్డు స్థాయిలో రిలీజ్ కాబోతుంది. మన సినిమాలు ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు” అని తెలిపారు.