దిల్ రాజు కూతురు ఎమోషనల్ పోస్ట్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూతురు హన్షిత ఎమోషనల్ అయ్యారు. అమ్మ అనిత పుట్టినరోజు సందర్భంగా ఆమె జ్ఝాపకాలని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. తల్లికి సంబంధించిన బాల్య జ్ఞాపకాన్ని తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టింది హన్షిత.

“పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా.. నిన్ను చాలా మిస్ అవుతున్నా. ఇప్పటికీ ఎప్పటికీ నీ జ్ఞాపకాలతోనే జీవిస్తున్నా. నీతో ఎన్నో జ్ఞాపకాలు. నేను ఎక్కువగా నీతో కలిసి ఫోటోలు దిగాను. నీ చిరునవ్వు దృశ్యాల చిత్రాలెన్నో. నీ దృష్టిలో ప్రేమ అంటే… ఎప్పటిలాగే నన్ను గట్టిగా కౌగిలించుకోవడం” అంటూ ఎమోషన్ అయ్యారు.

దిల్ రాజు మొదటి భార్య అనిత కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఇటీవలే దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారు. హోస్టెస్ తేజస్విని పెళ్లాడారు. ఈ పెళ్లికి దిల్ రాజు కూతురు హన్షిత పెద్దగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.