నిజామాబాద్’లో దారుణం.. ఆక్సిజన్ అందక 4గురు మృతి !

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకొంది. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సిలిండర్ అయిపోవడంతో కొవిడ్‌ విభాగంలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ముగ్గురు, సాధారణ వార్డులో ఒకరు మృతి చెందారు. వీరంతా నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వారే. ఈ విషయం తెలుసుకున్న బాధితుల కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకుని ధర్నా చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.