స్టార్ హీరోయిన్ పై చెప్పులు విసిరారు

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కంగనా రౌనత్. అయితే ఆమె కెరీర్ స్టార్టింగ్ లో అనుమానాలు, చిరత్కారాలని ఎదుర్కొందట. పలు ఇంటర్వ్యూలో దాని గురించి చెప్పింది. తన సినిమా గ్యాంగ్ స్టర్ నిర్మాత మహేశ్ భట్ పై సంచలన గతంలో ఆరోపణలు చేసింది.

ఇటీవల బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత.. బాలీవుడ్ లో బంధుప్రీతిపై కంగనా ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పూజా భట్, కంగనాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మొదటి అవకాశం ఇచ్చిన త‌న తండ్రిపై ప్ర‌తిసారీ కంగనా విమ‌ర్శ‌లు చేస్తోంది అంటూ పూజా భట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కంగా ఘూటుగా స్పందించింది.

‘మీ నాన్న అవకాశం ఇవ్వడం వల్ల నాకు ఎప్ప‌టికీ కోలుకోలేని న‌ష్టం జ‌రిగింది. సరిగ్గా అదే స‌మ‌యంలో నాకు తెలుగులో మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘పోకిరి’ సినిమాలో దర్శకుడు పూరి జగన్నాథ్ అద్భుత అవ‌కాశం ఇచ్చారు. మీ ‘గ్యాంగ్‌స్టర్‌’ సినిమా వల్ల ‘పోకిరి’లాంటి మంచి సినిమా  వదులుకున్నాను’ అని పూజా భట్‌పై కంగ‌నా మండిపడ్డారు. అంతేకాదు.. గ్యాంగ్ స్టర్ టైమ్‌లో మీ ఫ్యామిలీ (పూజా భట్‌ ఫ్యామిలీ) వాళ్లు నాపై చెప్పులు విసిరి అవ‌మానించారు. అంతేకాదు, నీకు పిచ్చి ఉంది.. ఈ సినిమా తర్వాత నీ కథ ముగిసినట్లే అని విమర్శించారు’ అంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టారు.