తెలంగాణలో 1,178 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1,178 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయ్. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 736 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 33,402కి చేరింది. శనివారం 9 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 348కి చేరింది. శనివారం 1,714 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 12, 125 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక గ్రేటర్ హైదరాబాద్ లో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ విధించబోతున్నారనే ప్రచారం జరిగింది. ప్రభుత్వం కూడా దీనిపై సమాలోచనలు చేస్తున్నట్టు తెలిపింది. అయితే మరోసారి హైదరాబాద్ లాక్‌డౌన్ ఉండదని మంత్రులు క్లారిటీ ఇస్తున్నారు. లాక్‌డౌన్ వలన ఉపయోగం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.