మళ్లీ రాహుల్’కే పగ్గాలు

2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీ సీనియర్లు, కార్యకర్తలు ఎంత బతిమిలాడిన అధ్యక్షుడిగా కొనసాగేందుకు రాహుల్ ససేమిరా అన్నారు. దీంతో చేసేదేమీ లేక సోనియా గాంధీ తాత్కాఌక అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే తాజాగా మళ్లీ రాహుల్ నే పార్టీ పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీల నుంచి ఒత్తిడి మొదలైంది.

శనివారం పార్టీ ఎంపీలతో సోనియాగాంధీ సమావేశమైన సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక పరిస్థితి, కరోనా, భారత్-చైనా వివాదంపై ఈ సమావేశంలో చర్చించారు. అయితే ఈ సమావేశంలో ఎంపీలంతా మళ్లీ రాహుల్ పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరినట్టు తెలుస్తోంది. మరీ.. గతంలో అధ్యక్షుడిగా కొనసాగనేనని తేల్చి చెప్పిన.. రాహుల్ మనసు మార్చుకొని మళ్లీ పార్టీ పగ్గాలు చేపడతారా ? అన్నది చూడాలి.