వారికి హృదయపూర్వక కృతజ్ఝతలు : అమితాబ్

బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబ్ ఫ్యామిలీ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అమితాబ్, అభిషే, ఐశ్వర్యారాయ్, ఆరాధ్యలకి కరోనా సోకింది. వీరంతా ప్రస్తుతం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అమితాబ్ ఫ్యామిలీ కరోనా నుంచి కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదిక పోస్టులు పెడుతున్నారు.

తాజాగా దీనిపై అమితాబ్ స్పందించారు. వారికి ట్విట్టర్ వేదికగా కృతజ్ఝతలు తెలిపారు. ‘అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యతో పాటు తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఆకాంక్షించిన వారందరికి హృదయపూర్వ కృతజ్ఝతలు’ అంటూ అమితాబ్ ట్విట్ చేశారు. ఇక టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, నాగార్జున.. తదితరులు అమితాబ్ ఫ్యామిలీ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్విట్ చేశారు.