మంత్రి సీటీ రవికి కరోనా

సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్ర మంత్రి సీటీ రవికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన భార్యకు మాత్రం కరోనా నెగటివ్ వచ్చింది. తన కరోనా సోకిన విషయాన్ని మంత్రి ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఇక కర్నాటకలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అక్కడ ఇప్పటి వరకు 36,216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో సీఎం యడ్యూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. 55 గంటల పాటు రాష్ట్రంలో కఠిన లాక్‌డౌన్ ప్రకటించారు.