కరోనాపై రంగం భవిష్యవాణి : మరిన్ని గడ్డు రోజులను ఎదుర్కోవాల్సి వస్తుంది

ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారు స్వర్ణలతను ఆవహించి భవిష్యవాణి వినిపించారు. ఎవరు చేసుకున్నది వారు అనుభవించక తప్పదన్నారు. కోరోనా నేపథ్యంలో భవిష్యత్‌లో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అయితే కట్టడి చేయడానికి తాను ఉన్నానని.. భక్తి భావనతో ఐదు వారాలు శాక పోసి, యజ్ఞాలు చేయండని ఆజ్ఞాపించారు.

ప్రతి గడప నుంచి శాక, పప్పుబెల్లాలు రావాలన్నారు. కామంతో కాకుండా, భక్తిభావనతో చేసినట్టైతే… తప్పక కాపాడతానన్నారు. ఈ ఏడాది ఉత్సవాలు తనకు సంతోషంగా లేవని అమ్మవారు అన్నారు. ప్రజలందిరినీ తాను కాపాడతానని, కరోనాపై పోరాడతానని తెలిపారు. మరిన్ని గడ్డు రోజులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.