కరోనాతో తెలంగాణ కాంగ్రెస్ నేత మృతి

సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులని కూడా కరోనా కాటేస్తోంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేత జి. నరేంద్ర యాదవ్ కరోనాతో మృతి చెందారు. ఇటీవలే నరేంద్ర యాదవ్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అయితే ఆయన ఆరోగ్యం విషమించి ప్రాణాలు విడిచారు.

ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన అన్ని కార్యక్రమాల్లోనూ నరేందర్‌ యాదవ్‌ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల్లో శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఆయనతో సన్నిహితంగా ఉన్న నేతలు హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోతున్నారు. నరేంద్ర యాదవ్ మరణంతో తెలంగాణ కాంగ్రెస్ లో విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల కాంగ్రెస్ నేతలు సంతాపం తెలియజేస్తున్నారు.