ఏపీ పదో తరగతి రిజల్ట్స్.. నో గ్రేడ్స్.. ఆల్ పాస్ !

కరోనా విజృంభన నేపథ్యంలో తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దయిన సంగతి తెలిసిందే. ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా విద్యార్థులకి గ్రేడ్స్ ఇచ్చారు. రిజల్ట్ ప్రకటించారు. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా పదో తరగతి పరీక్షలని రద్దు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

మార్చి 2020 పరీక్షలకు నమోదు చేసుకున్న పదో తరగతి విద్యార్ధులందరినీ పాస్ చేస్తున్నట్టు పేర్కొంది. ఎస్ఎస్‌సీ, ఓఎస్ఎస్‌సీ, ఒకేషనల్ పరీక్షలన్నీ రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే పదో తరగతి విద్యార్థులందరికీ ఎలాంటి గ్రేడ్ పాయింట్లూ ఇవ్వకుండానే ఉత్తీర్ణుల్ని చేసినట్లు ప్రకటించారు.