ప్రభాస్ సినిమా.. దీపికా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?


ప్రభాస్-నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో ఓ పాన్‌ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇదో సైన్స్ ఫిక్సన్. భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్‌ నిర్మించనుంది. ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెని తీసుకొన్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఈ సినిమా కోసం దీపికా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. ఇప్పటివరకు తెలుగు పరిశ్రమలో ఓ సినిమా కోసం హీరోయిన్‌కు ఇచ్చిన పారితోషికం కంటే ఎక్కువ దీపిక డిమాండ్‌ చేస్తోందని సమాచారం. 

మరోవైపు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్‌ ‘రాధే శ్యామ్‌’ సినిమా పనుల్లో ఉన్నాడు. ఆ సినిమా తర్వాత #ప్రభాస్‌21 ఉండబోతోంది. ఈ యేడాది డిసెంబర్ ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా మొదలవుతుందని నిర్మాత అశ్వినీదత్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే కరోనా ప్రభావంతో మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది.