దేశంలో 10 లక్షలు దాటిని కరోనా కేసులు

దేశంలో కరోనా విజృభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసులు, మృతుల సంఖ్య రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 34,956 పాజిటివ్‌ కేసులు, 687 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో శుక్రవారంనాటికి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,03,832కు చేరింది. మృతుల సంఖ్య 25,602కి చేరింది.

దేశంలో కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 6,35,757 మంది కోలుకోగా మరో 3,42,473 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల రికవరీ రేటు 63శాతంగా ఉంది. జూన్‌ నెల మధ్యలో 50శాతంగా ఉన్న రికవరీ రేటు జులైనాటికి 63శాతానికి పెరగడం ఊరట కలిగించే విషయం.