హోం క్వారంటైన్ లోకి సీఎం

సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, దేశాధినేతలు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా కలవరంతో హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. తాజాగా నాగాలాండ్ సీఎం నైఫియు హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

ఇప్పటికే కరోనా కలవరంతో నాగాలాండ్ డిప్యూటీ సీఎం యంతుంగో పట్టన్‌, ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యేకు  కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఇప్పుడు నాగలాండ్ సీఎం కూడా కరోనా కలవరంతో హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ఢిల్లీ పర్యటన నుంచి తిరిగిన వచ్చిన తర్వాత కోహిమాలోని తన అధికార నివాసంలో సెల్ఫ్ క్వారెంటైన్ అయ్యారు. అయితే ఇంటి నుంచే విధులు నిర్వర్తించనున్నట్లు సీఎం తన ట్విట్టర్‌లో వెల్లడించారు.