తెలంగాణలో 1676 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1676 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 41,018కి చేరింది. నిన్న కరోనాతో 10మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 396కి చేరింది.

ఇక కొత్తగా నమోదైన 1676 కొత్త కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో 788 కరోనా కేసులు నమోదయ్యాయ్. రంగారెడ్డి జిల్లాలో 224, మేడ్చల్‌లో 160, సంగారెడ్డిలో 57 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 1296 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 27,295కి చేరుకుంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో 13,228 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.