ఓటీటీ రిలీజ్ వద్దంటున్న హీరోలు

కరోనా ఎఫెక్ట్ తో థియేటర్స్ బంద్ అయ్యాయ్. మార్చి ఆఖరి వారం నుంచి థియేటర్స్ మూతపడ్డాయి. తిరిగి ఎప్పుడు తెరచుకుంటాయ్ అన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సినిమాల రిలీజ్ కి ఓటీటీ ఒక్కటే ఆప్షన్ గా మారింది. నిర్మాతలు కూడా తమ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అంటున్నారు. హీరోలు మాత్రం ఓటీటీ వద్దంటున్నారు.

వి, రెడ్ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఈ రెండు సినిమాలకి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. నిర్మాతలు కూడా రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ హీరోలు ఆపుతున్నారు. ‘వి’ సినిమాని ఓటీటీ రిలీజ్ చేయడం నానికి అస్సలు ఇష్టం లేదట. తన సినిమా ఓటీటీలో రిలీజైతే.. ఆ ప్రభావం తన తదుపరి సినిమాలపై పడుతుందని ఆయన భావిస్తున్నారు. ఇక ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ చేసిన ‘రెడ్’ సినిమాకు ఓటీటీ నుంచి బంపర్ ఆఫర్లు వస్తున్నాయ్. కానీ రామ్ నో చెప్పేస్తున్నారు.