TSలో 1478 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 2 4గంటల్లో తెలంగాణలో1478 కొత్త కేసులు  నమోదయ్యాయ్. కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 806 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలొ మొత్తం కరోనా కేసుల సంఖ్య 42,496కి చేరింది. శుక్రవరం కరోనాతో ఏడుగురు మృతి చెందారు. దీంతో.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 403కి చేరింది.

శుక్రవారం 1410 కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 28,705గా ఉంది. ప్రస్తుతం 13,389 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాకు భయపడాల్సిన పనిలేదు. అలాగని నిర్లక్ష్యంగా ఉండకూడదని సీఎం కేసీఆర్ శుక్రవారం సూచించారు. కరోనా సోకినవారు ప్రయివేటు ఆసుపత్రుల్లో చేరాల్సిన పనిలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.