పడగొట్టారు.. పడిపోతున్నారు !

టీమిండియా సౌతాఫ్రికా టూర్’ని ఘనంగానే మొదలెట్టింది. కేప్ టౌన్ టెస్టులో మొదటి బ్యాటింగ్’కు దిగిన సౌతాఫ్రికాని భారత బౌలర్లు బెంబెత్తించారు. భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ స్పెల్ లోనే 3 వికెట్లు పడగొట్టాడు. డీన్ ఎల్గర్ 0, మార్క్‌రం 5, ఆమ్లా 3, డివిల్లియర్స్ 65, ప్లెస్సిస్ 62, డి కాక్ 43, ఫిలండెర్ 23, మ‌హరాజ్ 35, ర‌బాడా 26, మోర్కెల్ 2, పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీంతో.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 286కు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తీయగా అశ్విన్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక షమీ, బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు చెరో వికెట్ లభించాయి.

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియాది అదే పరిస్థితి. భారత్ 16 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. అనంతరం 18 పరుగుల వద్ద, 27 పరుగుల వద్ద రెండు, మూడో వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం రోహిత్ శర్మ 0, పుజారా 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో రోజు తొలి సెషన్ భారత్ కు అత్యంత కీలకం. వికెట్లు పడకుండా కాపాడుకోగలిగితే మ్యాచ్ పై పట్టు బిగించే అవకాశం ఉంది.