#Prabhas21 సప్రైజ్ వచ్చేసింది

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటించనున్న 21వ సినిమా ఇది. వైజంతి మూవీస్ నిర్మించనుంది. ఈ సినిమాకు సంబంధించి సప్రైజ్ చెప్పబోతున్నామని శనివారం చిత్రబృందం ప్రకటించింది. కొద్దిసేపటి క్రితమే #Prabhas21 సప్రైజ్ వచ్చేసింది. ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నటించనున్నట్టు ప్రకటించారు.

ఇదో సస్పెన్స్ థ్రిల్లర్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయ్.  ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్తవ్వగానే నాగ్ అశ్విన్ సినిమాని మొదలెట్టబోతున్నారు. ఈ సినిమాలో ఇతర నటీటులు, టెక్నిషన్స్ వివరాలని త్వరలోనే ప్రకటించనున్నారు.